
కందిపప్పు - 100 gms
ఎండుమిరపకాయలు - 6
జీలకర్ర - 1tsp
ధనియాలు - 1 tsp
నెయ్యి - 1 tsp
నూనె - tbsp
కరివేపాకు - 1రెబ్బ
చింతపండు - నిమ్మకాయంత
ముందుగా నెయ్యి వేడి చేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి తీసి పక్కన పెట్టి, ఆ తరవాత కంది పప్పును దోరగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించి మిగతా వస్తువులతో కలిపి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నెలలు చల్లుకుంటూ ముద్దగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు వేసి చిటపటలాడాక పచ్చడిలో కలపాలి. ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది
0 comments:
Post a Comment