
మినప్పప్పు 100 gm
బియ్యపు పిండి 75 gm
రాగిపిండి 200 gm
పచ్చిమిరపకాయలు 4
నెయ్యి అర కప్పు
ఉప్పు తగినంత
మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు,
బియ్యపు పిండి, రాగిపిండి అన్నీ కలుపుకొని ఒక రాత్రంతా పిండిని పులవనివ్వాలి.
తెల్లవారి వేడి పెనం మీద దీనిని కొద్దిగా మందంగా అట్టు పోసుకోవాలి. ఒక వైపు
ఎర్రగా కాల్చి రెండవవైపు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా
కాల్చుకోవాలి. దీనికి కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్.
0 comments:
Post a Comment