Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

చేపల పులుసు


చేపలు 1 kg
ఉల్లిపాయలు 250gm
కొబ్బరిపొడి 75 gm
జీలకర్ర పొడి 1 tsp
మెంతి పొడి 1/2 tsp
ధనియాల పొడి 2 tbsp
కారంపొడి 2 tsp
పసుపు 1/2tsp
ఉప్పు తగినంత
చింతపండు 100 gm
అల్లం వెల్లుల్లి 1 tbsp
నూనె 5 tbsp

ముందుగా చేపలను శుభ్రం చేసుకుని అరంగుళం ముక్కలుగ కోసి పెట్టుకోవాలి.చింతపండును అరకప్పు నీళ్ళలో నానబెట్టాలి. ఉల్లిపాయలు
సన్నగా తరిగి నూనెలో ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయలు,కొబ్బరిపొడి,ధనియాల పొడి,జీలకర్ర,మెంతిపొడి,కారం,పసుపు తగినంత ఉప్పు ,అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ కలిపి గ్రైండర్లో ముద్ద చేసుకోవాలి.చింతపండును చిక్కటి
పులుసు తీసి పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి కొద్దిగా జీలకర్ర మెంతులు వేసి చిటపటలాడాక చింతపండు
పులుసు నూరిన ముద్ద కలిపి పోయాలి.చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోయాలి.ఇప్పుడు ఈ పులుసును బాగా మరగనివ్వాలి.
పులుపు వాసన పోయాక చేప ముక్కలు అందులో జాగ్రత్తగా వేయాలి.చేప ముక్కలు పులుసులో ఉడికి నూనె తేలాక దింపేయాలి.ఇది వేడిగా కాని చల్లగా కాని తినొచ్చు.దీనికి జొన్న రొట్టె ఉంటె సూపర్

0 comments:

Post a Comment