
పీతలు 1 kg
అల్లం వెల్లుల్లి 2 tsp
ఉల్లిపాయలు 4
నూనె 8 tsp
కొబ్బలిపొడి 3 tbsp
గసగసాలు 2 tsp
మజ్జిగ 1 గ్లాసు
లవంగాలు 6
యాలకులు 6
దాల్చిన చెక్క 4
ధనియాలు 2 tbsp
కొత్తిమిర 10 రెమ్మలు
కరివేపాకు 2 రెమ్మలు
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి 3
పీతలు శుభ్రపరచి మీక కావలసిన సైజులో ముక్కలు చేసుకుని కడిగి పెట్టుకోవాలి.
ఈ ముక్కలలో ఉప్పు,పసుపు వేసి గ్లాసు మజ్జిగ పోసి కొంచెం సేపు రాసి కడగాలి.
అల్లం వెల్లుల్లి,ఉప్పు కారం,పసుపు 2 లవంగాలు,2 యాలకులు,రెందు దాల్చిన
చెక్కలు మెత్తగా ముద్దగా నూరుకొని ఈ కడిగి ఉంచుకున్న ముక్కలకి బాగా
పట్టించాలి. రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిగిలిన
రెండు ఉల్లిపాయలు, మిగిలిన మసాలా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద
వెడల్పాటి బాణలి పెట్టి నూనె వేడి చేసి ఉల్లి పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించి పీతల
ముక్కలను వేసి ఐదు నిమిషాలు వేయించి సగం గ్లాసుడు నీళ్ళు పోసి నిదానంగా
ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నూరి ఉంచిన మసాలా ముద్దను వేసి కొత్తిమిర,
కర్వేపాకు సన్నగా తరిగి వేసి నీరంతా ఇగిరిన తర్వాత దించుకోవాలి.